దారుణం : వ్యక్తి తలపై బండరాయితో మోది వ్యక్తి దారుణ హత్య

by Dishanational2 |
దారుణం : వ్యక్తి తలపై బండరాయితో మోది వ్యక్తి దారుణ హత్య
X

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో ఆదివారం ఉదయం వెలుగు చూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్ మండలంలోని న్యాల్కల్ గ్రామానికి చెందిన కట్ట రమేష్ (47) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రోజులాగే ఇంటి శనివారం దాబాపైన నిద్రించాడు. అర్ధరాత్రి దాటాక గుర్తుతెలియని వ్యక్తులు కట్ట రమేష్ తలపై బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఉదయం చూసిన గ్రామస్తులు మోపాల్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న సౌత్ రూరల్ సిఐ సురేందర్ రెడ్డి, మోపాల్ ఎస్ఐ మహేష్ కేసు నమోదు చేసి, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అయితే శనివారం కట్ట రమేష్ అతని భార్యకు మధ్య గొడవ జరిగింది. అనంతరం ఆదివారం ఉదయం హత్యకు గురి కావడంతో, పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవే హత్యకు కారణమా, లేక వివాహేతర సంబంధాలతో ఎవరైనా చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Read More: జీవనోపాధికి వెళ్తూ.. అనంతలోకాలకు

Next Story

Most Viewed